పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం: జిల్లా కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు, ప్రకాశం న్యూస్: విలువైన సమయమంతా సెల్ఫోన్ వినియోగంలో దుర్వినియోగమవుతోందని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. చిన్నారుల్లో, పెద్దల్లో చైతన్యం రావాలంటే ప్రతిఒక్కరూ తప్పకుండా పుస్తకాలు చదవాలని ఆయన సూచించారు. పుస్తక పఠనం ద్వారా సృజనాత్మకతతోపాటు వ్యక్తిగత వికాసానికి దోహదపడుతుందని తెలిపారు.